ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 1, 2020, 8:19 PM IST

ETV Bharat / state

అన్ని విధాల అభివృద్ధి చేస్తాం: మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పర్యటించారు. జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా దానికి తానే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అర్థరహితమన్నారు.

minister anil kumar yadav
నగరంలో మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ పర్యటన


నెల్లూరు నగరాన్ని రానున్న మూడేళ్లలో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ తెలిపారు. మొదటి ఏడాదే నగరంలో దాదాపు 220 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. నగరంలోని మన్సూర్ నగర్, ఖుద్దూస్​నగర్, బారకాసు సెంటర్, వాహబ్ పేట ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రామలింగాపురం ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్​ పనులను పది రోజుల్లో మొదలు పెట్టి, సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. కాలువల ఆధునికీకరణ పనులను చేపడతామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details