కరోనా కారణంగా లాక్డౌన్ వల్ల కల్యాణవేదికలుమూగబోయిన..ఇప్పుడు కొన్ని వేడుకలకు సిద్ధం కానున్నాయి. కార్తీకమాసంలో పెళ్లిల్ల సీజన్ మొదలుకావడంతో...షాపింగ్ మాల్లు, అభరణాల దుకాణాలు కళకళలాడనున్నాయి.
నెల్లూరు జిల్లా గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో కల్యాణవేదికలు సుమారుగా 90 వరకు ఉన్నాయి. అటు తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాలతో పాటు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నవి ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా కొందరు ఇళ్ల దగ్గరే సెట్టింగ్స్ వేసి పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇలా సీజన్లల్లో పెళ్లి వేడుక స్థాయిని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ. కోట్ల వరకు వ్యయం చేస్తుంటారు. ఇలా ఏటా రూ. కోట్లలో వ్యాపారం సాగుతోంది. దీంతో అటు కొందరికి ఉపాధి మార్గంగా పొట్ట నింపుతోంది. పెళ్లిళ్లు సాగడం ద్వారా బట్టల దుకాణాలు, బంగారు ఆభరణాలు, వసతి, ఆతిథ్యం, డెకరేషన్, మంగళవాయిద్యం ఇలా అనేక రంగాలు ఇందులో ముడిపడి ఉంటం వల్ల ఈ రంగం ఎనిమిది నెలలుగా కుదేలైంది.
ఆశ్వయుజమాసం ఆరంభంతో పెళ్లిలు చేసుకోవడానికి ప్రజలు అడుగులు వేస్తున్నారు. ఎనిమిది నెలలుగా పూర్తి స్థబ్ధత ఉన్న రంగం కాస్త కోలుకుంటోంది. ఆతిథ్యం రంగంపై మళ్లీ ఆశలు మొదలు కావడంతో ఆయా రంగాల్లో ఉపాధి పొందే యువత సంతోషపడుతోంది. దీనిపై నమ్మకంతో ఉన్న వేల మందికి ఉపాధి దొరుకుతుందని నమ్మకంతో ముందుకెళ్తున్నారు. దాదాపుగా నెలన్నర మాసం అంటే కార్తీకం, మార్గశిరం మాసం వరకు పెళ్లిలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా ఆగి వివాహ తంతు ఇక వేగంగా సాగనుండటంతో దీని మీద ఆధారపడ్డ అనేక అనుబంధ రంగాలు ఆశతో ఉన్నాయి.
వివాహాల తంతులో మొదటిది వివాహ వేదిక..