ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలిమేరల్లో మహిళ అనుమానాస్పద మృతి

నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు పొలిమేరల్లో ఓ మహిళ మృతదేహాన్ని పాక్షికంగా దహనం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : May 14, 2019, 8:11 PM IST

అనుమానాస్పదంగా మహిళ మృతి

అనుమానాస్పదంగా మహిళ మృతి

నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు పొలిమేరల్లో దట్టమైన కంప చెట్ల మధ్య ఓ మహిళ మృతదేహాన్ని పాక్షికంగా దహనం చేసి ఉండడాన్ని స్థానికులకు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, జాగిలం, వేలిముద్రల నిపుణుల విభాగం వంటి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశాయి. సీఐ నరసింహారావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ మహిళ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details