ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్తతో భూ వివాదం.. కర్రతో కోడలు దాడి - నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్​

ఆస్తి వివాదాలతో అత్తపై కోడలు దాడి చేసింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో జరిగింది. భూ వివాదంపై జరిగిన ఘర్షణలో మరో వ్యక్తితో కలిసి కర్రతో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

attack an aunt
అత్తపై కోడలు దాడి

By

Published : Mar 1, 2021, 8:47 AM IST

ఆస్తి తగాదాల కారణంగా అత్తపై కోడలు దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో కలకలం సృష్టించింది. గ్రామంలో ఎకరా 20 సెంట్ల పొలం విషయంలో ఇరువురి మధ్య నెలకొన్న వివాదమే ఈ ఘర్షణకు కారణమైంది.

మాటా మాటా పెరిగి.. అత్త రుక్మణమ్మపై మరో వ్యక్తితో కలిసి కోడలు లక్ష్మి.. కర్రతో దాడి చేసింది. ఈ ఘటనలో రుక్మిణమ్మకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి​కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details