ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2020, 11:45 PM IST

ETV Bharat / state

'కార్పొరేట్​కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దింది ఈ ప్రభుత్వమే'

నెల్లూరు జిల్లాలో జగనన్న విద్యా కానుక పథకాన్ని మంత్రి అనిల్​, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​ రెడ్డి ప్రారంభించారు. విద్యా కానుక కిట్లను తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.

jagannanna vidya kanuka kits given to children
నెల్లూరులో జగనన్న కిట్లను పిల్లలకు అందించిన మంత్రి అనిల్​

కార్పొరేట్​ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ అన్నారు. నెల్లూరు ఈఎస్​ఆర్​ఎం పాఠశాలలో జగనన్న విద్యా కానుకను ఆయన ప్రారంభించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా... రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్​ అమలు చేస్తున్నారని తెలిపారు.

ఉదయగిరిలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి చక్కగా చదవుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని ఎమ్మెల్యే తెలియజేశారు. విద్యా కానుక ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​, దివంగత మాజీ సీఎం వైఎస్​ చిత్రపటాలకు విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేశారు. తహసీల్దార్​ హరనాథ్​ ఎంపీడీవో వీరస్వామి, ఎంఈవో మస్తాన్​ వలీ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details