ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరులో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Aug 25, 2020, 8:11 PM IST

రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ... అక్రమ తరలింపు ఆగడం లేదు. తాజాగా నెల్లూరులో ఎస్​ఈబీ అధికారులు జరిపిన దాడుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం భారీగా పట్టుబడింది.

Heavy Karnataka liquor seize in Nellore
నెల్లూరులో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

నెల్లూరులో అక్రమ మద్యం భారీగా పట్టుబడుతోంది. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో... స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2,860 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ నాలుగు లక్షల రూపాయలపైనే ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కేసుతో సంబంధమున్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details