ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2020, 5:50 PM IST

ETV Bharat / state

మూలకు చేరిన మగ్గం... నేతన్న బతుకు భారం..!

లాక్​డౌన్​ నేపథ్యంలో చేనేత కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. పని లేక పూట గడవని పరిస్థితి నెలకొందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో చేనేతను నమ్ముకున్న దాదాపు 30 వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని నేతన్నలు దీనంగా వేడుకుంటున్నారు.

మూలకు చేరిన మగ్గం.. నేతన్న బతుకు భారం..!
మూలకు చేరిన మగ్గం.. నేతన్న బతుకు భారం..!

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులు

సాధారణంగానే చేనేత మగ్గాలు అతికష్టం మీద నడుస్తాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి చేనేత కార్మికులది. గోరుచుట్టపై రోకలి పోటులా నేతన్నల జీవితాలపై లాక్​డౌన్ తీవ్ర దెబ్బకొట్టింది. కరోనాతో ఇళ్లకే పరిమితమైన నేత కళాకారుల జీవనం దుర్భరంగా మారింది. చేనేత వెతలపై నెల్లూరు జిల్లా నుంచి మా ప్రతినిధి రాజారావు అందిస్తున్న కథనం..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details