ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 25, 2020, 8:18 PM IST

ETV Bharat / state

నిరు పేదల ఆకలి తీరుసున్న 'ఫ్రెండ్స్'!

నెల్లూరులో ఫ్రెండ్స్ అసోసియేషన్.. పేదలకు ఆపన్నహస్తం అందిస్తోంది. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు అల్పాహారం, భోజనం ప్యాకెట్లను సంఘ సభ్యులు అందిస్తున్నారు.

nellore  district
ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆపన్నహస్తం..

నెల్లూరులో లాక్ డౌన్ కారణంగా ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న పేదలకు ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆపన్నహస్తం అందిస్తోంది. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు అల్పాహారం, భోజనం ప్యాకెట్లను అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం పేదలకు ఆహారం అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. మార్చి 25 నుంచి ఇప్పటివరకు దాదాపు 13వేల మందికి ఆహారం అందజేశామని మనోజ్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు తాము ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details