నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య.. కరోనాకు ఆయుర్వేదం మందు ఇవ్వడాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేలాది మంది ఆ ఔషధాన్ని వినియోగించినా.. ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఆధునిక సాంకేతికత, ఖర్చుతో కూడుకున్న మందులు ఉపయోగిస్తున్నా.. ఆయా ఆస్పత్రుల్లో రోజూ కొవిడ్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:ఉచిత టీకా కోసం మోదీకి మాజీ ఐఏఎస్ల లేఖ