ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జయభారత్ హాస్పిటల్ వద్ద ఆత్మీయ సభ.. హాజరైన డీఆర్డీఓ చైర్మన్

By

Published : Jan 16, 2021, 10:47 PM IST

సింహపురి వైద్య సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ వద్ద జరిగిన ఆత్మీయ సమావేశంలో డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు కృషి చేయాలని డీఆర్డీఓ చైర్మన్ కోరారు.

DRDO Chairman attending the Atmiya Sabha held at Jayabharat Hospital in Nellore
జయభారత్ హాస్పిటల్ వద్ద జరిగిన ఆత్మీయ సభకు హాజరైన డీఆర్డీఓ చైర్మన్

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ వద్ద సింహపురి వైద్య సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను.. తక్కువ ఖర్చుతో అందించేందుకు వైద్యులు కృషి చేయాలని డీఆర్డీఓ చైర్మన్ కోరారు. దేశ జనాభాకు తగ్గట్లు డాక్టర్లు, వైద్య సదుపాయాలు లేవని పేర్కొన్నారు. సామాజిక సేవతో పలువురు హాస్పిటల్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి:

కాలనీ పేరు మార్చారని.. మంత్రి ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details