నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్లోని వాసిలి గ్రామంలో పద్మాలయ ట్రస్టు సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, కూలీలు, రైతులకు బియ్యం, కూరగాయలు, మాస్కులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.
ఆత్మకూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పద్మాలయ ట్రస్టు నిర్వాహకులు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
![ఆత్మకూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ distribution-of-vegetables-and-essentials-to-the-poor-people-in-nellore-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6965243-802-6965243-1587996912877.jpg)
పంపిణీకి సిద్ధంగా ఉన్న నిత్యావసర వస్తువులు