నెల్లూరులోని 25వ డివిజన్ వాసులకు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసునాయుడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించి 40 రోజులు అవుతున్నందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ నిబంధనను పాటించి, వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, కార్మికులకు పలువురు దాతలు తమవంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ