నెల్లూరు మూలపేటలోని వెంకయ్యస్వామి గురు నిలయంలో... పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వెంకయ్యస్వామి శిష్యుడు మాకాని వెంకట్రావు ఆధ్వర్యంలో... 20 ఏళ్ల కిందట దుప్పట్లు పంపిణీ ప్రారంభమైంది. ఏడాది కిందట వెంకట్రావు మరణించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది చలికాలంలో నిరుపేదలకు పెద్ద ఎత్తున దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది 2500 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఇక్కడ వెంకయ్యస్వామికి నిత్యం పూజలు చేయడంతో పాటు... ప్రతి శనివారం వందలాది మందికి అన్నదానం చేస్తుంటారు.
వెంకయ్యస్వామి గురు నిలయంలో దుప్పట్ల పంపిణీ - నెల్లూరు మూలపేటలోని వెంకయ్య స్వామి గురు నిలయం
నెల్లూరు మూలపేటలోని వెంకయ్యస్వామి గురు నిలయంలో... పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. 20 ఏళ్లుగా ఈ పంపిణీ చేస్తున్నట్లు దాతలు చెప్పారు.

వెంకయ్య స్వామి గురు నిలయంలో పేదలకు దుప్పట్ల పంపిణీ
వెంకయ్యస్వామి గురు నిలయంలో దుప్పట్ల పంపిణీ