నెల్లూరులోని పలు డివిజన్ల్లో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా నగరంలోని బస్తీల్లో కలియ తిరిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ అర్హులు వాటిని వినియోగించుకోవాలన్నారు.
వారి వల్లే ఆలస్యం..
స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి.. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్లడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యమవుతోందని మంత్రి వివరించారు.