నెల్లూరు జిల్లా సంగం వద్ద జాతీయ రహదారిపై కొండను తవ్వి నెల్లూరు టూ కడప రోడ్డుని నిర్మించారు. వర్షం వచ్చినప్పుడల్లా కొండ చరియలు విరిగిపడి రోడ్డు మీద పడుతున్నాయి.దీంతో వర్షాకాలంలో ఆ రహదారి పై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు. అధికారులు కొండ చరియలు విరిగి పడకుండా రక్షణగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరారు.
కొండను తవ్వి రహదారి...ప్రాణంమీదకు వస్తున్న ప్రయాణం - national highway news in nellore dst
నెల్లూరు జిల్లా సంగం వద్ద కొండను తవ్వి జాతీయ రహదారి నిర్మించారు.నెల్లూరు టూ కడప వెళ్లే ఈ రహదారిపై వర్షం పడితే యమలోకానికి దారిలా మారిందని కొందరు వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొండచరియలు విరిగిపడి భయంకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![కొండను తవ్వి రహదారి...ప్రాణంమీదకు వస్తున్న ప్రయాణం dangerous highway road in nellore to kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7589672-103-7589672-1591970140911.jpg)
dangerous highway road in nellore to kadapa