రాష్ట్రానికి ద్రోహం చేసిన భాజపాతో కలిసి వైకాపా, తెదేపా, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. నెల్లూరులో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీలన్నీ ప్రజలకు సమాధానం చెప్పాలని మధు నిలదీశారు. పార్టీల పరిస్థితులపై 15 వ తేది వరకు దేశ వ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. సీపీఎం ప్రచారోద్యమం - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
రాష్ట్రానికి ద్రోహం చేసిన భాజపా విధానాలను ఎండగడదాం అంటూ సీపీఎం పిలుపునిచ్చింది. భాజపాకు మద్దతుగా పనిచేస్తున్న వైకాపా, తెదేపా , జనసేనలను నిలదీద్దాం అంటూ ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ఈ రోజు నుంచి 15వ తేది వరకు దేశంలో ప్రచారోద్యమం నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు.
![ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. సీపీఎం ప్రచారోద్యమం cpm protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9466917-746-9466917-1604748636433.jpg)
cpm protest