జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ.. నెల్లూరులో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. కొవిడ్ రోగులకు ఆక్సిజన్, వెంటిలేటర్లు, పడకల సంఖ్య పెంచాలని.. సీటీ స్కాన్, ఎమ్ఆర్ఐలను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకుడు మాదాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీ- 22 మంది మృతి