ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆస్తి పన్ను పెంపు ఆర్డినెన్స్​లను ఉపసంహరించుకోవాలి' - CPM leaders protest against government in Nellore

మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలపై ఆస్తి పన్నులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆర్డినెన్స్​లు విరమించుకోవాలని నెల్లూరులో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధిస్తే, ప్రజలపై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

cpm leaders protest
సీపీఎం నాయకులు నిరసన

By

Published : Dec 2, 2020, 4:12 PM IST

పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరులో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పన్నులు పెంచేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాగితాలను దహనం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, పన్ను భారం మోపే నిర్ణయాలు తీసుకోవడం దారుణమని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు.

ఆరు మున్సిపల్ చట్టాలకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, దాన్ని చట్టంగా మార్చేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధిస్తే, ప్రజలపై అధిక భారం పడుతుందని వివరించారు. వెంటనే పన్ను పెంపు ఆర్డినెన్స్​లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details