ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనీస సౌకర్యాలు లేక కరోనా రోగుల ఇక్కట్లు - కనీస సౌకర్యాలు లేక కరోనా రోగుల ఇక్కట్లు

కనీస సౌకర్యాలు లేక నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కరోనా పాజిటివ్ రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో పడకలు, గదులు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు.

కనీస సౌకర్యాలు లేక కరోనా రోగుల ఇక్కట్లు !
కనీస సౌకర్యాలు లేక కరోనా రోగుల ఇక్కట్లు !

By

Published : Aug 2, 2020, 4:21 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కరోనా పాజిటివ్ వచ్చిన వారి పరిస్దితి రోజురోజుకి దారుణంగా తయారవుతుంది. కనీస సౌకర్యాలు లేక రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పాజిటివ్ వచ్చిన వారి కోసం జిల్లా ఆసుపత్రి, టిట్​కోలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఉదయం ఎస్​పేట మండల కేంద్రం నుంచి పాజిటివ్ వచ్చిన అయిదుగురు బాధితులను 108లో ఆత్మకూరు టిట్​కోలోని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. కానీ అక్కడ గదులు లేవంటూ..వారిని అంబులెన్స్​లోనే ఉంచారు. ఐసోలెషన్ వార్డుల్లో పడకలు, గదులు లేనప్పుడు మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తరలించారని బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details