ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ముగ్గురికి తీవ్ర గాయాలు - nandipadu conflict latest news

ఎన్నికలకు సంబంధించి తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మాటామాటా పెరగటంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Conflict between two groups
ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : Feb 10, 2021, 1:29 PM IST

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వటంతో.. ఆసుపత్రికి తరలించారు. దీంతో వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ABOUT THE AUTHOR

...view details