ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టైర్ పేలి లారీని ఢీకొట్టిన కారు.. నవదంపతులతో సహా ఐదుగురికి గాయాలు - undefined

నవదంపతులు ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కనిసిరిపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో.. మొత్తంగా ఐదుగురు గాయపడ్డారు. కారు టైరు హఠాత్తుగా పేలిపోవడంతోనే ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు

By

Published : Aug 24, 2021, 7:00 AM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కనిసిరిపాలెం పరిధిలోని జాతీయ రహదారిపై.. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. నవ దంపతులతోపాటు ఐదుగురు గాయాలపాలయ్యారు. నెల్లూరు నుంచి వింజమూరు వెళ్తున్న వీరి కారు.. టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ప్రమాదంలో గాయపడి రోదిస్తున్న నవవధువు

వాహనం తీవ్రంగా దెబ్బతినగా.. అందులో ఉన్న నవదంపతులు మహాలక్ష్మి, సుధీర్ తోపాటు మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు.. 108కి ఫోన్ చేసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details