నెల్లూరు జిల్లా అనంతసారం మండలం సోమశిలలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. హిందూ దేవాలయ ఆస్తులకు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోమశిల సోమేశ్వర ఆలయంలో పట్టపగలే వినాయకుడి విగ్రహం దొంగలించి నెలలు గడుస్తున్నా కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ ఘటనపై స్థానిక మంత్రి స్పందించకపోవటమేంటని నిలదీశారు. అంతర్వేది రథం దగ్ధం కావటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'హిందూ దేవాలయ ఆస్తులకు రక్షణ కల్పించాలి' - somashila bjp leaders agitation news
హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని నెల్లూరు జిల్లా సోమశిలలో భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అంతర్వేది రథం దగ్ధమైన ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
!['హిందూ దేవాలయ ఆస్తులకు రక్షణ కల్పించాలి' bjp agitation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8745374-983-8745374-1599703197649.jpg)
భాజపా నేతల నిరసన