నెల్లూరు జిల్లా చెన్నావరప్పడు గ్రామంలో 754 ఓట్లకు 700 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో పావళ్ల మంజుల అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా.. ప్రత్యర్థి పావళ్ల రమణమ్మ రీకౌంటిగ్ చేయమని కోరింది. అందుకు అధికారులు అంగీకరించి... రీకౌంటింగ్ జరపకుండానే వెళ్లిపోయారు. అధికారుల ప్రకటనపై అనుమానాలు ఉన్నాయని... రీపోలింగ్ జరపాలని రమణమ్మ డిమాండ్ చేశారు.
రీకౌంటింగ్ చేస్తామని నమ్మించారు... ఆ తర్వాత.. - local people protest in Chennavarappadu village
సంగం మండలం చెన్నావరప్పడు గ్రామంలో రీకౌంటింగ్ చేస్తామని నమ్మించి... చేయకుండానే అధికారులు వెళ్లిపోయారని... సర్పంచి అభ్యర్థి మద్దతుదారులు ఆరోపించారు. ఎన్నికలపై తమకు అనుమానాలు ఉన్నాయని.. రీపోలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు.
![రీకౌంటింగ్ చేస్తామని నమ్మించారు... ఆ తర్వాత.. demanding for re polling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10621511-1012-10621511-1613289228411.jpg)
రీ కౌంటింగ్ చేస్తామని చెప్పి ఉడాయించిన ఎన్నికల అధికారులు