ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డుపై చమురు.. అదుపు తప్పిన బైక్.. మహిళ మృతి

ఆదూరుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళ మృతి చెందింది. రహదారిపై చమురు ఉండడంతో బైక్ అదుపుతప్పింది. బైక్ వెనకాల కూర్చున్న మహిళ కిందపడిపోయింది. అటుగా వస్తున్న ట్రాక్టర్ ఆ మహిళపై నుంచి వెళ్లింది. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

By

Published : May 20, 2021, 8:52 AM IST

accident
accident

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై చమురు ఉండడంతో ఓ బైక్ అదుపుతప్పింది. ఈ ఘటనలో బైక్ వెనక కూర్చున్న మహిళ రోడ్డుపై పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రాక్టర్ ఆ మహిళపై నుంచి వెళ్లిపోయింది.

ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురానిని గోనుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మాతమ్మగా గుర్తించారు. ఆదూరు పల్లి నుండి గొనుపల్లి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details