ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెంచలకోన ఆలయంలో ఏకాంతగా లక్ష్మి నరసింహస్వామి కల్యాణోత్సవం - Lakshmi Narasimha Swamy Kalyanotsavam at penchalakona

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ రోజు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెనుశిల లక్ష్మి నరసింహస్వామి వార్ల కల్యాణోత్సవాన్ని ఆర్చకులు ఘనంగా నిర్వహించారు.

Brahmotsavam at Penchalakona Temple
పెంచలకోన ఆలయంలో లక్ష్మి నరసింహా స్వామి కల్యాణోత్సవం

By

Published : May 26, 2021, 6:58 PM IST

నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులు పెనుశిల లక్ష్మి నరసింహస్వామి వార్ల కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణం కనువిందుగా సాగింది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. ఈ ఉత్సవాన్ని తిలకించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం చక్రస్నానం నిర్వహిస్తారు. శనివారం ఉత్సవమూర్తులను గొనుపల్లికి సాగనంపడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

నృసింహ జయంతి మరుసటి రోజు సాంప్రదాయంగా జరిగే ఈ ఉత్సవాల్లో ఏటా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా వచ్చేవారు. కొవిడ్ నిబంధనల మేరకు వేడుకలను ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details