ఇటీవల తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వరదలు పోటెత్తాయి. జిల్లాలోని సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది. నీటి మట్టం పెరగటంతో దిగువకు సుమారు 250 టీఎంసీల నీరు విడుదల చేశారు. జలాశయం ఆఫ్రాన్ ప్రాంతంతో పాటు పొర్లు కట్టలు కూడా కొంతమేర దెబ్బతిన్నాయి.
దెబ్బతిన్న జలాశయం ప్రాంతాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ డిజైనింగ్ అండ్ సేఫ్టీ విభాగానికి సంబంధించిన బృందాన్ని ప్రభుత్వం సోమశిలకు పంపింది. బీఎస్ఎన్ రెడ్డి నేతృత్వంలో జియోలాజికల్ సర్వే పుణే డైరెక్టర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల బృందం రిజర్వాయర్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జలాశయానికి సంబంధించిన సీఈ, ఎస్ఈ, ఈఈ స్థాయి అధికారులతో సమీక్షించారు.