ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పు చెల్లించలేక.. ఉరేసుకుని యువకుడు బలవన్మరణం - ఖాన్ సావళి కుమారుడు షేక్ సంధాని

తండ్రికి వైద్యం అందించేందుకు తెచ్చిన రూ.3 లక్షలను.. తిరిగి ఇవ్వాలంటూ రుణదాతలు ఒత్తిడి చేయడాన్ని భరించలేకపోయిన ఓ యువకుడు... బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సీతారాంపురంలో జరిగింది.

అప్పు చెల్లించలేక ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
అప్పు చెల్లించలేక ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

By

Published : May 8, 2021, 8:27 AM IST

నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండల కేంద్రం పరిధిలోని కోటవీధికి చెందిన ఓ యువకుడు... ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటవీధికి చెందిన ఖాన్ సావళి కుమారుడు షేక్ సంధాని ఇంట్లో చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితం అతని తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడని ఎస్సై రవీంద్ర నాయక్ తెలిపారు. తండ్రి అనారోగ్యంగా ఉన్న సమయంలో వైద్యం చేయించేందుకు సంధాని రూ.3 లక్షల వరకు అప్పు చేశాడని చెప్పారు.

రూ.3 లక్షల అప్పు వల్లే..

అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు చెల్లించాలంటూ.. పలు మార్లు ఒత్తిడి చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ క్రమంలో రుణాన్ని తిరిగి చెల్లించేందుకు మార్గం కనిపించకపోవడంతో మనస్థాపం చెంది చీరతో ఉరేసుకున్నాడని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:

కొత్త వారికి ఇప్పట్లో టీకా ఇవ్వలేం: అనిల్ సింఘాల్

ABOUT THE AUTHOR

...view details