ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MURDER: మద్యం సేవించి కుమారుడు వేధింపులు..హత్య చేసిన తండ్రి - నెల్లూరు జిల్లా పాటూరులో కొడుకుని హతమార్చిన తండ్రి

రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి వేధిస్తున్న కుమారుడిని తండ్రే హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లా కొవూరు పోలీస్​స్టేషన్​ పరిధిలో కలకలం రేపింది.

a father killed his son at Nellore
కొడుకును హతమార్చిన తండ్రి

By

Published : Jun 26, 2021, 5:11 PM IST

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు హరిజనవాడలో దారుణం జరిగింది. మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని కొడుకును తండ్రే హతమార్చాడు. దీంతో స్థానికంగా కలకలం రేపింది. హరిజనవాడకు చెందిన కోటేశ్వరరావు కుమారుడు శివకుమార్..​ తరచూ మద్యం తాగొచ్చి ఇంట్లో వాళ్లను వేధింపులకు గురిచేసేవాడని తండ్రి తెలిపాడు. కొడుకును పలుమార్లు మందలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎప్పటికైనా కుమారుడు మారుతాడని ఆశించినా.. అతనిలో ఎలాంటి మార్పు లేకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తండ్రీకొడుకులిద్దరూ ఘర్షణ పడ్డారు.

కోపోద్రిక్తుడైన తండ్రి.. ఇనుప రాడ్​​తో దాడి చేయగా శివకుమార్​ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details