ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 6:00 PM IST

ETV Bharat / state

జిల్లా సరిహద్దులు దాటి ప్రయాణిస్తున్న 18మంది అరెస్టు

లాక్​డౌన్ ప్రభావంతో పలు జిల్లాల మధ్య రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. శ్రీకాళహస్తిలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున నెల్లూరు జిల్లాలో పోలీసులు అప్రమత్తమై... సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేశారు. అయినప్పటికీ రాకపోకలు సాగిస్తున్న 18మందిపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

18 arrested for crossing district borders in nellore district
వివరాలు వెల్లడిస్తున్న వెంకటగిరి పోలీసులు

చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వెంకటగిరికి రాకపోకలు సాగిస్తున్న 18 మంది ద్విచక్ర వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటగిరి సమీపంలో మన్నెగుంటలో సాధారణ దుస్తుల్లో పోలీసులు నిఘా వేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి వెంకటగిరికి వస్తున్న వాహనదారులను ఆపి కేసులు నమోదు చేశారు. 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details