తల్లి మందలించదని మనస్థాపం చెందిన 12 ఏళ్ల బాలిక.. ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో బీసీ కాలనీలో జరిగింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో నీరు ప్రవహించే ప్రాంతాలకు వెళ్లొద్దని తన కుమార్తె నసీబాను.. తల్లి మెహరిన్ బీ మందలించింది. మనస్తాపం చెందిన బాలిక చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన తల్లి, స్థానికుల సహాయంతో తలుపు బద్దలు కొట్టి.. బాలికను కిందకు దింపింది.
వైద్యం కోసం ఆటోలో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ స్థానికులకు కనిపించిన బాలిక మృతిచెందటం కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలిక తండ్రి నాయబ్ రసూల్ జీవనోపాధి కోసం సౌదీ అరేబియాలో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు సమాచారం అందించారు.