నందమూరి బాలకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నెల్లూరు తెలుగుదేశం పార్టీ 10 వేల మాస్కులను అందజేశారు. నగరంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఈ మాస్క్లను తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్కు అందించారు. తొమ్మిది లక్షలు విలువ చేసే 60 వేల మాస్కులను కలెక్టర్కు, 50 వేల మాస్కులను నగర ప్రజలకు అందజేసినట్లు శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. తెదేపా అధినేత చంద్రబాబు ముందు చూపు కారణంగానే కరోనా పరీక్షలు నిర్వహించే పరికరాలు రాష్ట్రంలో తయారు చేయగలుగుతున్నారన్నారు.
మాస్కులు పంపిణీ చేసిన నందమూరి బాలకృష్ణ సేవాసమితి - నెల్లూరు తెలుగుదేశం పార్టీ తాజా వార్తలు
నెల్లూరులో నందమూరి బాలకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో 10 వేల మాస్కులను జిల్లా కలెక్టర్కు అందజేశారు. వీటితో పాటు హోమియో మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

నందమూరి బాలకృష్ణ సేవాసమితి 10వేల మాస్కుల విరాళం