ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Waqf Board Lands Case: పేదలపై ఎమ్మెల్యే కక్ష.. ఇళ్లు ఖాళీ చేయాలంటూ హెచ్చరిక

Waqf Board Lands Case: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ఆజాద్ నగర వాసులు ఏళ్ల తరబడి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు.. ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో.. ప్రభుత్వ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టడంతో.. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

By

Published : May 29, 2023, 8:13 PM IST

Waqf Board Lands Case
పైదలపై ఎమ్మెల్యే కక్ష.. వారు ఉంటున్న ఇళ్లు ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు

Waqf Board Lands Case: 18 ఏళ్లుగా అనేక కష్టాలు అనుభవిస్తూ జీవిస్తున్న గుడిసెల్లో దీపాలు ఆర్పకండి అంటూ పల్నాడు జిల్లా వినుకొండలోని ఆజాద్ నగర్ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వక్ఫ్ బోర్డు భూముల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఇటీవల ప్రభుత్వ అధికారులు ఆజాద్ నగర్​ను సందర్శించి అక్కడ నివాసం ఉంటున్న పేదలకు హుకుం జారీ చేసి హెచ్చరిక బోర్డులు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుఆజాద్ నగర్ పేదలపై కక్ష కట్టినట్లుగా మాట్లాడటం.. అక్కడ నివాసం ఉంటున్న వారు చీకటి వ్యాపారం చేస్తున్నారంటూ అసభ్యకరమైన పదాలను ఎమ్మెల్యే హోదాని మరిచి విచక్షణ లేకుండా మాట్లాడటంపై బాధిత పేద ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

అకస్మాత్తుగా భర్త మృతి.. ఇంట్లోనే దహనం చేసిన భార్య..

సీపీఐ భూ పోరాటంలో భాగంగా సుమారు 5వేల మందికి పైగా పేదలు మసీదు మాన్యం భూముల్లో గుడిసెలు, చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. నాడు ముజావర్లు మసీదు మాన్యం భూములను అమ్ముకోవటం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి చూసి రియల్టర్లు, భూ భకాసురుల చేతుల్లోకి వెళ్తున్న మసీదు మాన్యం భూములను సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేదలపై కక్ష కట్టి నీరు, కరెంటు నిలిపివేసి పేదల గుడిసెల్లో దీపం ఆపేందుకు.. ఆయన అనుకున్న వారికి అప్పగించేందుకు దౌర్జన్యం చేస్తున్నాడని వాపోతున్నారు. అంతేకాకుండా పేదల పట్ల చులకనగా వ్యవహరిస్తూ అసభ్యకరంగా మాట్లాడటం దుర్మార్గం అని వాపోతున్నారు.

తల్లికూతుళ్ల గొడవ.. పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్న కుమార్తె..

కూలి పనులు చేసుకొని వేలాది మంది పేద కుటుంబాలు మసీదు మాన్యంలో ఉన్న నివేశన స్థలంలో చిన్న చిన్న ఇళ్లు కట్టుకొని జీవిస్తున్నామని అంటున్నారు. ముస్లిం మైనారిటీలతో పాటు అనేక కులాలు, మతాలకు చెందిన పేదలు సోదర భావంతో మసీదు మాన్యం నందు జీవిస్తుంటే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పెద్దలకు భూములు ధారాదత్తం చేసేందుకు పేదలకు అన్యాయం చేయటం అత్యంత దుర్మార్గమని అంటున్నారు. అక్కడ నివసించే ప్రతి ఒక్క కుటుంబానికి ఎక్కడ ఇల్లు లేదని, ఎటువంటి ఆస్తులు లేవని తామంతా నిరుపేదలమని అంటున్నారు.

బాలికను కత్తితో పొడిచి, రాయితో కొట్టి హత్య.. నడిరోడ్డుపైనే బాయ్​ఫ్రెండ్ దారుణం..

రెక్కల కష్టంపై సంపాదించుకున్న డబ్బుతో ఇళ్లు నిర్మిచుకుని నివాసముంటున్నామని.. ఇప్పుడు ఉన్నట్టుండి తమను ఖాళీ చేయమంటే ఎక్కడకు వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాకు సాయం చేయకుంటే మాకు ఆత్మహత్యలు శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి మసీదు మాన్యం వాసులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. వక్ఫ్ బోర్డు వారితో మాట్లాడి వన్ టైం సెటిల్మెంట్ లేదా 33 సంవత్సరాలు లీజుకైనా ఇప్పించి రెన్యువల్ చేస్తూ తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details