ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాపారం చేయాలనుకున్నారు... కానీ పెట్టుబడి లేదు.. అందుకు ఏం చేశారంటే..! - ఆరు నెలల్లో 55 బైక్​ల చోరీ

Bike thieves in Palnadu: ఆ ముగ్గురు వ్యాపారం చేసి బాగా సంపాదించాలనుకున్నారు. కానీ, వారి వద్ద పెట్టుబడి లేదు. అందుకోసం వారికో ఉపాయం తట్టింది. మెుదట బైకులు దొంగిలించి.. వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో వ్యాపారం చేయాలనుకున్నారు. అంతే రంగంలోకి దిగి బైకులు దొంగిలిస్తున్నారు. ఇలా చేస్తుండగా.. ఒకరోజు పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. తీగలాగితే డొంకంతా బయటపడింది. వాళ్లు దొంగతనం చేసింది ఒకటి, రెండు కాదు.. ఏకంగా 55 బైక్​లు.

stole 55 vehicles in different areas
ఆరు నెలల్లో 55 బైక్​ల చోరి

By

Published : Oct 4, 2022, 8:19 PM IST

Bike thieves in Sattenapally: ఆరు నెలల్లో వివిధ ప్రాంతాలలో 55 వాహనాలను దొంగిలించారు. వాటిపై వచ్చిన సొమ్ముతో వ్యాపారం చేద్దామనుకున్నారు. చివరకు పోలీసులు తనిఖీల్లో పట్టుబడి కటకటాల పాలయ్యారు ఆ ముగ్గురు దొంగలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ క్రాస్ రోడ్డు వద్ద గ్రామీణ ఎస్సై బాలకృష్ణ, సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వాహనాలపై వస్తున్నారు. తనిఖీలను చూసి పారిపోతుండగా గుర్తించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.

వారిని విచారించగా గత మార్చి నెల నుండి ఇప్పటి వరకూ గుంటూరు, పల్నాడు జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో 55 ద్విచక్ర వాహనాలను అపహరించినట్లు వెల్లడించారు. వాటిని మూడు డంపులుగా విభజించి శివపురం తండా, గుల్కకొండ, బొడుకొండ అటవీ ప్రాంతాలలో 55 ద్విచక్ర వాహనాలను ఉంచినట్లు తెలిపారు. మరో 5 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన అనంతరం.. ముగ్గురూ సమానంగా 20 బైక్​ల చొప్పున పంచుకుందామనకున్నారు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఏదైనా వ్యాపారం చేసుకుందామని చోరీలకు పాల్పడ్డినట్లు తెలిపారన్నారు.

బైక్​ల చోరీలకు పాల్పడ్డ నిందితులు రాజుపాలెం మండలం ఉప్పలపాడుకు చెందిన వేల్పుల పేరయ్య (30), వేల్పుల గోపి (22), జంపు వెంకటేశ్వర్లు (30)లుగా పోలీసులు తెలిపారు. వీరంతా గుంటూరులోని మిర్చి యార్డులో పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారని వివరించారు. వారి నుంచి రూ.23.50 లక్షల విలువ చేసే 55 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. నింధితులను చాకచక్యంగా పట్టుకున్న సత్తెనపల్లి గ్రామీణ ఎస్సై బాలకృష్ణతోపాటుగా సిబ్బందిని ఆయన అభినందించారు.

ఆరు నెలల్లో 55 బైక్​ల చోరీ

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details