Varla Ramaiah : ఈ నెల 27 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న 'యువగళం' పాదయాత్రకు అనుమతి కోరుతూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. పాదయాత్రకు అనుమతితో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. లోకేశ్ను లక్ష్యంగా చేసుకుని ఇటీవల కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ వ్యతిరేకులు, ఫ్యాక్షనిస్టుల నుంచి లోకేశ్ ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు, రాత్రిపూట బసకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.
27 నుంచి లోకేశ్ 'యువగళం' పాదయాత్ర.. భద్రత కల్పించాలని డీజీపీకి వర్ల లేఖ - యువగళం పాదయాత్ర
Varla Ramaiah : ఈ నెల 27నుంచి యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు గతంలో టీడీపీ స్పష్టం చేసింది. ఈ పాదయాత్రకు టీడీపీ ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అందులో భాగంగా డీజీపీని అనుమతి కోరుతూ లేఖ రాసింది.
![27 నుంచి లోకేశ్ 'యువగళం' పాదయాత్ర.. భద్రత కల్పించాలని డీజీపీకి వర్ల లేఖ Varla Ramaiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17436475-740-17436475-1673253845163.jpg)
వర్ల రామయ్య
భద్రతా ఏర్పాట్లు చూసుకునేలా రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరారు. పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలను లోకేశ్ వ్యక్తిగత స్టాఫ్ నరేష్ చూసుకుంటారని లేఖలో పేర్కొన్నారు. ఇదే లేఖను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా వర్ల జత చేశారు.
ఇవీ చదవండి: