ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధానిపై మంత్రి బుగ్గన వ్యాఖ్యల ఎఫెక్ట్​.. చెన్నై లైవ్​ కట్​

By

Published : Feb 17, 2023, 3:56 PM IST

Updated : Feb 17, 2023, 9:23 PM IST

Minister Buggana Rajendranath Reddy: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​కు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆయన ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుండగానే ప్రభుత్వం లైవ్​ కట్​ చేసింది. ప్రత్యక్ష ప్రసారం సమయంలో కేవలం ప్రసంగం మాత్రమే ముగియగా.. కార్యక్రమం పూర్తి కాకుండానే లైవ్​ కట్​ అయ్యింది. ఇంతకీ ఎందుకు ఇలా జరిగిందంటే..

Minister Buggana Rajendranath Reddy
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

Minister Buggana Live Cut : రాజధాని అంశం ప్రభుత్వాన్ని వెంటాడుతునే ఉంది. ఈ అంశంపై ఇప్పటికే అనేక గందరగోళ ప్రకటనలు వెలువడటం.. తాజాగా బుగ్గన ఏపీకీ విశాఖే ఏకైక రాజధాని అనటంతో పెద్ద దుమారమే చెలరేగింది. ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న జీఐఎస్​ రోడ్​ షోలో రాజధానిపై పారిశ్రామికవేత్తలు పదే పదే ప్రశ్నిస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

మార్చి 3, 4 న జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా పరిశ్రమల శాఖ ఇవాళ చెన్నైలో రోడ్ షో నిర్వహిస్తోంది. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట చెన్నైలో ఈ రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోకు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్ ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భూ లభ్యత గురించి అధికారులు వివరించారు. ఏపీ ప్రస్తుతం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మారిటైమ్ బోర్డు వివరించింది. ఏపీలో 3 పోర్టులను ప్రభుత్వ రంగంలో, మరో పోర్టును ప్రైవేటు రంగంలో నిర్మిస్తున్నట్టు తెలిపారు. తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో ఏపీ ఆక్వారంగంలోనే కీలక పాత్ర పోషించబోతోందని ఏపీ మారిటైమ్ వెల్లడించింది.

బెంగుళూరు సదస్సులో పారిశ్రామికవేత్తల ప్రశ్నోత్తరాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా.. చెన్నైలో నిర్వహిస్తున్న సదస్సు లైవ్​ లింక్​ను ప్రభుత్వం కట్​ చేసింది. బుగ్గన ప్రసంగం ముగిసేంత వరకు కొనసాగిన ప్రత్యక్షప్రసారం.. ప్రశ్నలు-సమాధాన సమయంలో నిలిపివేసింది. పెట్టుబడిదారులు, మీడియా వర్గాల నంచి రాజధాని ఆంశంపై ప్రశ్నలు ఉండే అవకాశం ఉందని లైవ్​ను నిలిపివేశారు.

రాజేంధ్రనాథ్​ వ్యాఖ్యలు:మార్చి నెలలో విశాఖలో జరగనున్న గ్లోబల్​ ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్​ ప్రచారంలో భాగంగా బెంగూళూరులో రోడ్​షో కార్యక్రమం నిర్వహించారు. ఈ రోడ్​ షోకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి హాజరయ్యారు. ఏపీలోని వనరులు, మౌలిక వసతులను వివరించిన మంత్రి.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్​లు ఉన్నాయన్నారు. ఇవి పోర్టులకు అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన పోర్టుల వివరాలను సైతం వివరించారు.

ఇటీవలే ముఖ్యమంత్రి విశాఖను రాజధానిగా ప్రకటించారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న కాస్మోపాలిటన్ నగరం విశాఖేనని, విశాఖ ఉక్కు, తూర్పునౌకాదళ కమాండ్, హిందుస్తాన్ షిప్ యార్డ్, పోర్టు లాంటి కీలకమైన సంస్థలు ఉన్నాయన్నారు. విశాఖకు సమీపంలోనే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు వివరించారు. పరిశ్రమలకు అనుసంధానంగా 6 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు కూడా ఉన్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో వందల కిలోమీటర్ల మేర జాతీయ జలరవాణా మార్గం ఉందని మంత్రి వివరించారు. 2029 సంవత్సరం వరకు పది మిలియన్​ టన్నుల వరకు కార్గోను జల రవాణా మార్గాల ద్వారా తరలించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక అన్నారు. ఏపీలో 70 శాతం మంది జనాభా పనిచేసే వయస్సులో ఉన్నారని అన్నారు. పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతలో నైపుణ్యాభివృద్ధి చేస్తున్నమన్నారు. నౌకా నిర్మాణం, మరమ్మత్తుల రంగంలోనూ ఏపీ రాణిస్తోందని,పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 17, 2023, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details