TDP LEADERS:మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలపై.. జగన్ రెడ్డి బాదుడే బాదుడు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ, విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెట్టేం రఘురాం విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జగన్ పాలనలో నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్.. ఇలా అన్ని విషయాల్లోనూ బాదుడే బాదుడు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. డీజిల్ రేట్లు తగ్గినా.. మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
జగన్ రెడ్డి బాదుడు కొనసాగుతోంది : తెదేపా - తెదేపా నేతల నిరసనలు
TDP LEADERS: ఆర్టీసీ బస్సులో ఛార్జీల రేట్లు పెంచి రాష్ట్రప్రజలపై జగన్ బాదుడే.. బాదుడు కొనసాగిస్తున్నారని.. తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు నిరసనలు చేపట్టారు.
![జగన్ రెడ్డి బాదుడు కొనసాగుతోంది : తెదేపా TDP LEADERS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15725483-140-15725483-1656844375175.jpg)
TDP LEADERS
ప్లీనరీ సమావేశాల అర్థాన్ని మార్చిన వైకాపా నాయకులు