ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడి రైతులను జగన్ మోసం చేశారు: టీడీపీ నేత పట్టాభిరామ్

Jagan cheated the dairy farmers: పాడిరైతులను జగన్​మోహన్​రెడ్డి మోసం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అధికారంలోకి వస్తే లీటర్ పాలకు 4 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పిన జగన్, మాట తప్పారని అన్నారు.

By

Published : Dec 15, 2022, 2:21 PM IST

pattabhi ram
కొమ్మారెడ్డి పట్టాభిరామ్

Jagan cheated the dairy farmers: జగన్ రెడ్డి రాష్ట్రంలోని సహకార డెయిరీల ఆస్తులు కబ్జాచేయడానికి సరికొత్తగా అమూల్ బేబీ అవతారం ఎత్తారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. పాడిపరిశ్రమను తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న కుతంత్రంతోనే జగన్ రెడ్డి అమూల్ జపం చేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా చిత్తూరు డెయిరీ ఆస్తుల్ని నామమాత్రంగా ఏడాదికి కోటిరూపాయల చొప్పున 99 ఏళ్లకు అమూల్​కు లీజుకిచ్చారని మండిపడ్డారు. 2022లో కోటిరూపాయల లీజు.. మరో వందేళ్ల తర్వాత కూడా కోటిరూపాయలేనా అంటూ నిలదీశారు. ఎన్నికలకు ముందు లీటర్ పాలకు 4 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. కృష్ణామిల్క్ యూనియన్ ఏడాదికి 60 కోట్ల బోనస్ ఇస్తుంటే, సంగం డెయిరీ కొన్ని కోట్ల రూపాయల బోనస్ పాడిరైతులకు చెల్లిస్తుంటే, అమూల్ మాత్రం పైసా కూడా ఇవ్వడంలేదని పట్టాభిరామ్‌ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details