ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నవరత్నాల్లో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను చేర్చాలి: వ్యవసాయ కార్మిక సంఘం - విజయవాడలో రాష్ట్రస్థాయి భూసాధన సదస్సు

Recommendations Of Koneru Ranga Rao Land Committee: నిరు పేదలకు భూములను పంపిణీ చేసేందుకు.. రాజశేఖర్​ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు భూ కమిటీని.. ముఖ్యమంత్రి అమలుచేయటం లేదని వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపించింది..నవరత్నాల్లో భూ కమిటీ సిఫార్సులను చేర్చి.. భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది....

రాష్ట్రస్థాయి భూసాధన సదస్సు
రాష్ట్రస్థాయి భూసాధన సదస్సు

By

Published : Dec 22, 2022, 3:11 PM IST

Recommendations Of Koneru Ranga Rao Land Committee: నవరత్నాల్లో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను చేర్చి.. రాష్ట్రంలో పేదలకు వెంటనే భూ పంపిణీ చేయాలని రాష్ట్రస్థాయి భూసాధన సదస్సు తీర్మానించింది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తండ్రి ఆశయాలు నెరవేరుస్తానన్న జగన్.. రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపొందించిన కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో 59 శాతం గ్రామీణ ప్రజానీకానికి భూములు లేవని.. పేదలకు అనుకూలంగా ఎన్ని చట్టాలు వచ్చినా.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.. పేదలకు భూమి పంచాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. భూమి ఉంటేనే పేదలకు ఆత్మగౌరవం ఉంటుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. అవి పాలకుల కనుసన్నల్లోకి.. పెద్దల చేతుల్లోకి, భూమాఫియా చేతుల్లోకి వెళ్తోందని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details