Raised Social Security Pension: 250 పెంపుతో నేటి నుంచి 2 వేల 750 రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో 3వ తేదీ నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ లాంఛనంగా ఈ పెంచిన పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందించనున్నారు. రూ.2,750 చొప్పున సామాజిక భద్రత పింఛను ఇవ్వనున్నారు. అర్హులైన వారికి కొత్తగా మంజూరు చేసిన పింఛను, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.
పింఛన్ రూ.2,750.. నేటి నుంచి పెంపు వారోత్సవాలు - Andhra Pradesh latest news
Raised Social Security Pension: 250 పెంపుతో నేటి నుంచి 2 వేల 750 రూపాయల చొప్పున సామాజిక భద్రత పింఛన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.2,750 చొప్పున సామాజిక భద్రత పింఛను ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ పింఛను కానుక కింద కొత్తగా 2 లక్షల31 వేల 463 మందికి పింఛన్లు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన 1765 కోట్ల రూపాయల్ని సీఎం విడుదల చేశారన్నారు.
![పింఛన్ రూ.2,750.. నేటి నుంచి పెంపు వారోత్సవాలు Raised YSR pension](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17365615-905-17365615-1672539421803.jpg)
Raised YSR pension
నేటి నుంచి వారం రోజులపాటు నిర్వహించే పింఛను పెంపు వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్ఆర్ పింఛను కానుక కింద కొత్తగా 2 లక్షల31 వేల 463 మందికి పింఛన్లు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన 1765 కోట్ల రూపాయల్ని సీఎం విడుదల చేశారన్నారు.
ఇవీ చదవండి