PATTABHI TO RAJAMAHENDRAVARAM SUB JAIL : పోలీసుల అభ్యర్ధన మేరకు తెలుగుదేశం నేతల్ని గన్నవరం సబ్ జైలు నుంచి రాజమండ్రి కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో బుధవారం సాయంత్రం టీడీపీ నేతలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు న్యాయస్థానం ఆదేశాల మేరకు పట్టాభి సహా ఇతర తెలుగుదేశం నేతలను గన్నవరం సబ్జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. గన్నవరం సబ్జైలులో ఖాళీలేని పరిస్థితులు ఇతర ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం నేతలను వేరొక జైలుకు తరలించాలని పోలీసులు కోర్టును అభ్యర్ధించారు.
పోలీసుల తాజా అభ్యర్థనను విచారించి.. అందుకనుగుణంగా న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు.. తమ కస్టడిలోనే ఉంచుకున్నారు. వైద్యపరీక్షలు పూర్తయ్యేసరికి కోర్టు సమయం ముగియడంతో బుధవారం ఉదయం తిరిగి గన్నవరం అదనపు జూనియర్ సివిల్జడ్జి కోర్టులో పట్టాభిని హాజరుపరిచారు. వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి పట్టాభిని గన్నవరం సబ్జైలుకు పంపాలని ఆదేశించారు. తనపై పోలీసులు థర్డ్డిగ్రీ ప్రయోగించారని మంగళవారం న్యాయమూర్తికి పట్టాభి వివరించడంతో వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
బుధవారం వైద్య నివేదిక పరిశీలించాక గన్నవరం సబ్ జైలుకు పట్టాభిని తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరగా, ఆ అభ్యర్ధనను న్యాయస్థానం తిరస్కరించింది. ముందస్తు అనుమతి కోరితే పరిశీలిస్తానని న్యాయమూర్తి తెలిపారు. పోలీసులు అందుకనుగుణంగా ప్రత్యేక అభ్యర్థనను న్యాయమూర్తి ముందు పెట్టారు. మార్చి 7వ తేదీ వరకూ మంగళవారమే పట్టాభి సహా మొత్తం 14మంది తెలుగుదేశం నేతలకు న్యాయస్థానం రిమాండ్ విధించింది