ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం చిన్నచూపు - నిధులేవి జగనన్నా? - ఏపీ లేటెస్ట్ న్యూస్

Funds Shortage to Libraries: రాష్ట్రంలో గ్రంథాలయాలను నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ గ్రంథాలయాల్లో కనీసం వార్తాపత్రికలు వేయించడానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. నేటి నుంచి ఈ నెల 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Grandhalya_Varostavalu
Grandhalya_Varostavalu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2023, 10:22 PM IST

Updated : Nov 15, 2023, 8:57 AM IST

గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం చిన్నచూపు - నిధులేవి జగనన్నా?

Funds Shortage to Libraries: నేటి నుంచి ఈ నెల 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధుల కొరతతో ఏపీలో గ్రంథాలయాలు (AP Libraries) వెలవెలబోతున్నాయని పాఠకులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా లైబ్రరీలకు కనీసం వార్తాపత్రికలు వేయించడానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. లైబ్రరీల్లో పూర్తిస్థాయిలో వార్తాపత్రికలు, పుస్తకాలు అందుబాటులో లేవని నిరుద్యోగులు, పాఠకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Shortage of Books in Andhra Pradesh Libraries: రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కేంద్ర గ్రంథాలయం లేకుండా పోయింది. రాష్ట్ర పౌర గ్రంథాలయాల కార్యాలయాన్ని మంగళగిరిలోని ఒక శాఖా గ్రంథాలయంలో నడుపుతున్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో లైబ్రరీల్లో ఖాళీగా ఉన్న 1,012 పోస్టులను భర్తీ చేయలేదని నిరుద్యోగులు నిట్టూరుస్తున్నారు. నిధుల కొరత(Shortage of Funds)తో చాలా గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు, పక్ష, మాస పత్రికలు పూర్తిస్థాయిలో అందుబాటులోలేవని నిరుద్యోగులు, పాఠకులు నిరుత్సాహం చెందుతున్నారు.

సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు!

No Funds for Libraries: ఇంటి పన్నులో 8 శాతం గ్రంథాలయాలకు సెస్ రూపంలో చేరాలి. కానీ వసూలు చేస్తున్న సొమ్మును కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు.. జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించకుండా మొండికేస్తున్నాయి. విశాఖ కార్పొరేషన్‌ సుమారు 100 కోట్ల రూపాయలు బకాయి పడిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 109 గ్రంథాలయాలు ఉంటే.. స్థానిక సంస్థల నుంచి 34.62 కోట్ల రూపాయలు సెస్ బకాయి ఉంది.

Shortage of Funds in AP Libraries: ఒక్క విజయవాడ నగరపాలక సంస్థ నుంచే గ్రంథాలయాలకు 20.83 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. పన్నుల ద్వారా వసూలు చేసే ఈ నిధులు గ్రంథాలయాల అభివృద్ధి(Development of Libraries)కి ఖర్చు చేస్తే ఆ నిధులు ఎంతో మంది పాఠకులకు, నిరుద్యోగులకు తోడ్పాటునిస్తాయని పాఠకులు అంటున్నారు. 5వేల జనాభాకు ఒక గ్రంథాలయం ఉండాల్సి ఉండగా.. ఆచరణలో ఇది అమలు కావడం లేదు.

No Facilities in Libraries: ప్రశ్నార్థకంగా గ్రంథాలయాల మనుగడ.. సదుపాయాలు లేక ప్రజల పాట్లు

Grandhalya Varostavalu Start from Today: గ్రంథాలయాలు మూసివేసే పరిస్థితి ఉందని లైబ్రేరియన్లే చెబుతున్నారు. ప్రభుత్వం ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోటంతో ఒక్కో లైబ్రేరియన్‌ 2-3 గ్రంథాలయాలు నడపాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గ్రంథాలయాల్లో స్వీపర్లు లైబ్రేరియన్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని నిట్టూరుస్తున్నారు. గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగానైనా వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని పాఠకులు, ఉద్యోగులు కోరుతున్నారు.

డిజిటలైజేషన్​ దిశగా గ్రంథాలయాలు..

Last Updated : Nov 15, 2023, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details