ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ మెడికల్ కౌన్సిల్​లో తనిఖీలు.. వివరాలు వెల్లడించిన సీబీఐ - press note inspections in the AP Medical Council

CBI Officials Press Release: ఇతర దేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన వారు.. నకిలీ రిజిస్ట్రేషన్లు పొందారనే సమాచారంతో దేశ వ్యాప్తంగా సీబీఐ తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగా విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్​లో ఈ నెల 23న తనిఖీలు చేశారు. తాజాగా తనిఖీలపై సీబీఐ అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

CBI
సీబీఐ

By

Published : Dec 29, 2022, 7:21 PM IST

CBI Officials Press Release: విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులు.. నకిలీ రిజిస్ట్రేషన్​లు పొందారనే సమాచారం మేరకు సీబీఐ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 73 మంది నకిలీ రిజిస్ట్రేషన్​లు పొందారని సీబీఐ అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. దీనిలో భాగంగానే విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్​లో ఈ నెల 23న తనిఖీలు చేపట్టారు. పలు రిజిస్టర్ పుస్తకాలు, అప్లికేషన్లు, కంప్యూటర్​లోని డేటాను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 12 గంటల పాటు సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలపై సీబీఐ అధికారులు తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసారు.

ABOUT THE AUTHOR

...view details