ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో న్యాయ రాజధాని పనులు ప్రారంభించాలి: వైకాపా

కర్నూలును న్యాయ రాజధానిగా వెంటనే అమలు చేయాలని కోరుతూ వైకాపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు.

By

Published : Aug 27, 2020, 1:44 PM IST

ysrcp protest news
ysrcp protest news

కర్నూలును న్యాయ రాజధానిగా వెంటనే అమలు చేయాలని కోరుతూ వైకాపా నేతలు కర్నూలులో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు కొనసాగాలని.. లేని పక్షంలో గతంలో హైదరాబాద్ లాగే ఒకే చోట అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవని ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ అన్నారు. మూడు రాజధానులకు అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details