ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 27, 2020, 6:24 AM IST

ETV Bharat / state

పోలీసులు వస్తున్నారని భయంతో పరిగెత్తుతూ యువకుని మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం జరిగింది. రహదారి వద్ద కూర్చున్న పెద్ద హరివాణం గ్రామస్థులను.. లాక్​డౌన్​ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు లాఠీలతో తరిమారు. పోలీసుల లాఠీ దెబ్బలను తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

youth died in an attempt to escape from police in kurnool district
పోలీసుల చర్యల్లో పెద్ద హరివాణం యువకుడు మృతి

పోలీసుల తీరుతో పెద్ద హరివాణం యువకుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో పోలీసుల తీరు వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన వీరభద్రస్వామి.. బెంగళూరు వలస వెళ్లి లాక్​డౌన్​ కారణంగా స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో యువకులతో కలిసి రహదారి పక్కనే కూర్చోగా.. ఎవరూ ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తూ పోలీసులు అక్కడికి వచ్చారు. గుంపుగా కూర్చున్న వీరభద్రస్వామి బృందాన్ని వెంబడించడం వల్ల భయపడి పరిగెత్తారు. ఈ క్రమంలో వీరభద్రస్వామి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details