ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాపై దాడి చేసి అవమానించారు.. అందుకే చనిపోతున్నా..!' - రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

అవమాన భారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో.. తనపై కొందరు దాడి చేయటాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా' అంటూ సూసైడ్ నోటు రాసి తనవు చాలించాడు. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా యల్లూరులో చోటుచేసుకుంది.

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మహేశ్
రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మహేశ్

By

Published : Apr 6, 2021, 9:41 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మహేశ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్​ను బంధువులు గుర్తించారు.

అమ్మా.. నాన్నా.. క్షమించండి..!

"అమ్మా, నాన్న.. క్షమించండి. ఈ నెల 5 వ తేదిన జరిగిన ఘర్షణలో పుట్టా సుబ్బారాయుడు, పుట్టా కిశోర్ కలిసి నన్న కొట్టారు. అందుకే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ ఘర్షణపై గోస్పాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. దానికి సంబంధించిన లెటర్ నా బాక్సులో సెల్​ఫోన్ కవర్​లో ఉంటుంది. నా ఛావుకు కారకులు... పుట్టా వెంకటేశ్వరమ్మ, పుట్టా సుబ్బారాయుడు, పుట్టా రాధ, పుట్టా కిషోర్, పుట్టా సురేశ్" అని సూసైడ్ లెటర్​లో మహేష్ ఆరోపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

ఇదీ చదవండి:

రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details