ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు' - కర్నూలు వైకాపా ఎమ్మెల్యేల హర్షం

సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అన్నారు. కర్నూలు జిల్లా వాసులకు బెస్త, వీరశైవ లింగాయత్, వాల్మీకి, కుర్ణీ కార్పొరేషన్​లకు ఛైర్మన్ పదవులు రావడం సంతోషంగా ఉందన్నారు.

ycp mla's feels happy for giving  bc corporation chairmans and directors for kurnool people
'సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు'

By

Published : Oct 19, 2020, 12:42 PM IST

Updated : Oct 21, 2020, 1:57 AM IST


బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అన్నారు. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ లను, డైరెక్టర్లను నియమించడంపై కర్నూలులో వైకాపా ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సీఎం జగన్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా వాసులకు బెస్త, వీరశైవ లింగాయత్, వాల్మీకి, కుర్ణీ కార్పొరేషన్​లకు చైర్మన్ పదవులు రావడం సంతోషంగా ఉందని కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు అన్నారు.

'సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు'
Last Updated : Oct 21, 2020, 1:57 AM IST

ABOUT THE AUTHOR

...view details