ఇసుక అందుబాటులోకి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. మంత్రాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండ్యన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కూలీలకు పని దొరకటం లేదని... ఇళ్లు కట్టుకునేవారికి ఇసుక అందుబాటులో లేదని గుర్తు చేశారు. ఎవరైనా అవసరం ఉందని ఓ ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటే పోలీసులు కేసులుపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఇసుక సమస్య తీవ్రతపై వైకాపా ఎమ్మెల్యే ఆవేదన - sand problem latest news in manthralayam
ఇసుక సమస్య చాలా తీవ్రంగా ఉందని... ఇంతవరకు ఇసుక అందుబాటులోకి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రాలయం వైకాపా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ycp mla talking about sand problem