ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 25, 2021, 12:44 AM IST

ETV Bharat / state

కొడవలితో దాడి... మహిళ దారుణ హత్య

కర్నూలు జిల్లా బి.కోడూరు గ్రామంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కొడవలితో కొట్టి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

woman murdered in b.koduru kurnool district
మహిళ దారుణ హత్య

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బి.కోడూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మమ్మ హత్యకు గురైంది. ఇంట్లో మంచంపై మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు... కొడవలితో నాగలక్ష్మమ్మ తలపై కొట్టి చంపినట్లు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను హతమార్చినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులే హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి నలుగురు కుమారులు కాగా, ఆమె చిన్న కుమారుడు వద్ద ఉంటోంది.

ABOUT THE AUTHOR

...view details