ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త ఫోన్​ పాడైంది... భార్య ఆత్మహత్య చేసుకుంది... - కర్నూలులో మహిళ ఆత్మహత్య వార్తలు

భార్యాభర్తల మధ్య ఫోన్ చిచ్చు పెట్టింది. భర్త కొత్త ఫోన్ కొన్న క్రమంలో దంపతుల మధ్య గొడవ మొదలైంది. మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

wife suicide
wife suicide

By

Published : May 29, 2020, 7:34 AM IST

Updated : May 29, 2020, 8:21 AM IST

పచ్చని కాపురంలో కొత్తగా కొన్న సెల్​ఫోన్ చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య వివాదంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వగరూరులో జరిగింది. పార్వతి భర్త నాగరాజు మూడు రోజుల కిందట 15 వేల రూపాయలు పెట్టి కొత్త ఫోన్ కొన్నాడు. అది చెడిపోవడంతో మరమ్మతుకు మరింత సొమ్ము భార్యను అడిగాడు. లాక్​డౌన్ కారణంగా ఇళ్లు గడవడం కష్టంగా ఉందని.. సెల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తే ఎలా అని భార్య ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపంతో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వీరు జీవనం సాగిస్తుంటారు.

Last Updated : May 29, 2020, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details