ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 30, 2019, 5:35 PM IST

ETV Bharat / state

దారుణం.. భర్తను రోకలితో కొట్టి చంపిన భార్య

వేధింపులు భరించలేక భర్తను గొడ్డలితో నరికి చంపిందో భార్య. అనంతపురంలో జరిగిన ఈ దారుణం మరవక ముందే కర్నూలు జిల్లాలో మరో ఘటన జరిగింది. మహబూబ్​ బీ అనే మహిళ తన భర్తను రోకలితో తలపై కొట్టి హత్య చేసింది.

రోకలితో భర్తను కొట్టి చంపిన భార్య

భార్య చేతిలో భర్త హతం..!
కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో దారుణం జరిగింది. నిత్యం పెట్టే బాధలు భరించలేక భర్తను.. భార్య హత్య చేసింది. మహబూబ్​ బాషా, మహబూబ్​ బీ ఇద్దరూ దంపతులు. వారి మధ్య వివాదం చెలరేగటంతో మహబూబ్​ బాషాను.. మహబూబ్​ బీ రోకలితో తలపై మోది చంపింది. ఈ ఘటనలో బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details